మాదాపూర్ : కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో స్థానిక డివిజన్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్య, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ప్రతి ఒకరు కాలనీల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఎల్లవేలలా అందుబాటులో ఉంటు కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. కాలనీ వాసుల కోరిక మేరకు కాలనీలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్గౌడ్, జలమండలి మేనేజర్ పూర్ణేశ్వరి, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్రావు, కాలనీ వాసులు ఉమా మహేశ్వరరావు, బాలయ్య, సురేందర్, విష్ణువర్ధన్రెడ్డి, ప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.