సైదాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ కొవిడ్ టీకాలు ఇవ్వాలని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సీటిజన్లకు ఇంటి వద్దే కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో సీనియర్ సీటిజన్లకు ఆరోగ్య కార్యకర్త సరిత కొవిడ్ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులు ఓఎస్వీడీ ప్రసాద్, నేరళ్ల ప్రసాదరావు, శేషగిరిరావు, వైఎస్ఆర్ మూర్తి, సర్వేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బందితో కలిసి టీకాలు వేయిస్తున్నామని, కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ తీసుకుని కొవిడ్కు దూరంగా ఉండలన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆఫీసర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.