కరకగూడెం/ఆళ్లపల్లి, ఏప్రిల్ 12: మార్చి మూడో వారం నుంచే ఎండలు పెరిగాయి. జనాలు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో పట్టణ, పల్లె వాసులు కూలర్లు కొనేందుకు ఆసక్తి కనబరస్తున్నారు. వేసవిలో సాగే వ్యాపారాల్లో కూలర్ వ్యాపారానికి పల్లెల్లో డిమాండ్ పెరిగింది. కొందరు ఇంట్లో ఉన్న పాత కూలర్లకు మరమ్మతులు చేయించుకుని వినియోగంలోకి తీసుకువస్తుండగా, మరికొందరు కొత్తవి కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల్లో కూలర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సమ్మర్ సీజన్ ప్రారంభం నుంచే వ్యాపారులు రకరకాల రంగురంగుల మోడల్ కూలర్లు, వాటి ముడి సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. అల్యూమినియం, కాపర్ వైండింగ్తో తయారుచేసిన మోటర్లతో కూడిన కూలర్లు విక్రయిస్తున్నారు. సామాన్యంగా ఈ ప్రాంతవాసులు నిరుపేదలే కావడంతో వ్యాపారులు అతి తక్కువ ధరకు నాణ్యమైన కూలర్లు అందజేస్తున్నారు. అసెంబుల్ అయినప్పటికీ ఏజెన్సీవాసులకు ఉపయోగపడేలా ముడి సరుకు తెప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. సామాన్యునికి ఈ కూలర్లు ఏసీలాగా మారాయి. ఒక్కో కూలర్ రూ.2 వేల నుంచి విక్రయిస్తున్నారు. కాస్త స్తోమత ఉన్నవారైతే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వెచ్చించి కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. కూలర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధర పెరగడంతో కూలర్ల ధరలు పెరిగాయని అమ్మకందారులు చెబుతున్నారు. ఈ సారి వేసవిలో వ్యాపారం బాగా జరుగుతుందని నమ్మకంతో వ్యాపారులు ఉన్నారు.
అమ్మకాలు బాగున్నాయి
గతేడాది వేసవి సీజన్లో కరోనా నేపథ్యంలో అమ్మకాలు జరపలేదు. దీంతో ఈ ఏడాది వేసవికాలం ఆరంభం నుంచే అమ్మకాల జోరందుకుంది. ప్రజలకు అనువైన కూలర్లు ,ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే విధంగా అనువైన ధరలకు విక్రయిస్తున్నాం. రూ. 2వేల నుంచి రూ. 10 వేల విలువ చేసే కూలర్లు అందుబాటులో ఉంచాం. వేసవిలో పల్లెల్లో ప్రతి ఒక్కరూ కూలర్ వినియోగిస్తుండటంతో వ్యాపారం బాగుంది.ముంజాల వసంత్, కరకగూడెం, కూలర్ల వ్యాపారస్తుడు
ఇవి కూడా చదవండి
బిర్యానీ వండిన రైనా, రాయుడు..వీడియో చూసేయండి!
మేజర్ టీజర్ రివ్యూ.. అడవి శేష్ నీకు నిజంగా సెల్యూట్