కొత్తగూడెం, ఏప్రిల్ 12: డయల్ యువర్ కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల్లో పరిష్కరించి నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి 26 మంది ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేశారని, పరిష్కారం కోసం వాటిని సంబంధిత జిల్లా అధికారులకు సిఫార్సు చేశామని, పరిష్కార స్వభావాన్ని ఫిర్యాదు దారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయడం వల్ల రిస్కు ఉన్నందున సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మణుగూరులో అటవీ భూములు ఆక్రమణ అంశంపై తహసీల్దార్, అటవీ అధికారులు సంయుక్తంగా విచారణ నిర్వహించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ అనుదీప్, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్, డీఎంహెచ్వో భాస్కర్నాయక్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలి
జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇసుక కొరత రాకుండా రీచ్లు ఏర్పాటు చేయాలని మైనింగ్, టీఎస్ఎండీసీ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమీక్షించారు. రైతుల పొలాల్లో ఇసుక మేటలను తొలగించుకోవడానికి వచ్చిన దరఖాస్తుల్లో కమిటీ పరిశీలించి సమర్పించిన నివేదికలను పరిశీలించారు. ఈ నెల 16న జరిగే సమావేశానికి ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల గుర్తింపు, పట్టా భూముల్లో రైతులు ఇసుక తీసుకోవడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న అంశాలపై సమగ్ర నివేదికలతో హాజరుకావాలని సూచించారు. మైనింగ్ ఏడీ జయ్సింగ్, టీఎస్ఎండీసీ పీవో ఎల్లయ్య, భూగర్భజల శాఖ ఏడీ బాలు, డీఏవో కొర్సా అభిమన్యుడు, ఇరిగేషన్ అధికారి అర్జున్, ఏవో మంగ్యా, రంగాప్రసాద్ పాల్గొన్నారు.
కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలి
కరోనా నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి అధికారులకు సూచించారు. అంటువ్యాధులు, కరోనా నియంత్రణపై వైద్యాధికారులు, జిల్లా అధికారులతో కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఔట్ సోర్సింగ్ సబార్డినేట్ యాకూబ్ (50) చికిత్స పొందుతూ ఆదివారం మరణించడం బాధాకరమమన్నారు. జడ్పీ సీఈవో విద్యాలత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత