రూ.13 లక్షల నష్టం
చండ్రుగొండ, ఏప్రిల్3: మిరపకాయల లోడ్తో వెళ్తున్న వ్యాన్కు విద్యుత్ తీగలు తగిలి సరుకంతా దగ్ధమైన ఘటన శనివారం మండలపరిధిలోని అన్నారంతండాలో జరిగింది. బాధిత రైతులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారంతండా, కర్సల బోడు, వెంకటియాతండాకు చెందిన రైతులు భూక్య మూర్తి, భూక్య రాజేశ్, బానోత్ భాను, ఇస్లావత్ వీరన్న పండించిన 220 బస్తాల (86 క్వింటాళ్లు) మిర్చిని ఏపీలోని గుంటూరు మిర్చి మార్కెట్లో విక్రయించేందుకు వ్యాన్లో లోడ్ చేయించారు. శనివారం వ్యాన్ అన్నారంతండా గుండా వెళ్తుండగా మార్గమధ్యలో విద్యుత్ తీగలు తగిలి బస్తాలకు నిప్పంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్తో పాటు తండావాసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిమిషాల్లోనే లారీలోని సరుకంతా దగ్ధమైంది. ఆర్ఐ ముత్తయ్య, వీఆర్వో వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. చేతికి వచ్చిన రూ.13 లక్షల విలువైన మిర్చి దగ్ధమైందని, తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇవి కూడా చూడండి..
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు మృతి
దుర్గ్ ఆసుపత్రి మార్చురీలో పేరుకుపోతున్న మృతదేహాలు