తెలుగుయూనివర్సిటీ : పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని మాజీ స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కీర్తి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో లబ్థప్రతిష్టులైన పలువురికి డైమండ్ జూబ్లీ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూధనాచారి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తితో సమాజానికి సేవలు అందించేల పురస్కార గ్రహీతలు కృషి చేయాలని సూచించారు. సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, ప్రముఖ సంఘసేవకులు బిక్కి క్రిష్ణ, కీర్తిఆర్ట్ సంస్థ అధ్యక్షురాలు బిందులిమ్మ తదితరులు పాల్గొని అవార్డుల గ్రహీతల సేవలను కొనియాడారు.