చిక్కడపల్లి:కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ధైర్యంగా విలువైన సేవలు అందించింనందుకు గాను డాక్టర్ బీఆర్కెఆర్ ఆయుర్వేద కళాశాల(ఎరగడ్డ) ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రవీణ్ కుమార్ ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ కమిషనర్ డాక్టర్ బీఎస్ అలగు వర్షిణి ఈ మేరకు ఉత్తమ సేవలను గుర్తింపుగా సర్టిఫికేట్, అవార్డును బహుకరించారు. ఈసందర్భంగా డాక్టర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, మరింత రెట్టింపు ఉత్సాహంతో సేవలందిస్తానని చెప్పారు.