బేగంపేట్: జెమ్స్స్ట్రీట్ సబ్స్టేషన్ పరిధిలో గల విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్ల కారణంగా శనివారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. ఎస్టీ రోడ్డు ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, స్వప్నలోక్ కాంప్లెక్స్ 1,2 ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు. పార్క్లైన్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పార్క్లైన్ ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు.
అలాగే ఆస్రాని ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 1 గంటల నుంచి 2 గంటల వరకు ఆస్రాని హోటల్, హర్డీ కాంప్లెక్స్, పార్శీ కాంపౌండ్ ప్రాంతంలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు. ఎంజీ రోడ్డు ఫీడర్ పరిధీలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గాంధీ విగ్రహాం, ఇషాక్ కాంప్లెక్స్, కంచుబోమ్మ, సుబాష్రోడ్డు ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు. చికోటి కాంప్లెక్స్ ఫీడర్ పరిధిలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కండోజి బజార్, కళాసీగూడ, గాంధీ విగ్రహాం ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు.