బేగంపేట్ : మోండామార్కెట్, సీతాఫల్మండి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్ల కారణంగా సోమవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు. సీతాఫల్మండి ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సీతాఫల్మండి వెల్ఫేర్ అసోసియేషన్, ఎల్ఎన్ టవర్స్, ఆంధ్ర బ్యాంక్, త్రినేత్ర కాంప్లెక్స్, గణేష్ టెంపుల్, క్లాసిక్ అపార్ట్మెంట్ ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.
నామాలగుండు ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నాం 2 గంట వరకు నామాలగుండు, రామాలయం టెంపుల్,హనుమాన్ టెంపుల్, నె్ర హైస్కూల్ ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ ఉండదు. అలాగే మోండామార్కెట్ సబ్స్టేషన్ వారసిగూడ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సీతాఫల్మండి, మైలార్గడ్డ,రామాలయం టెంపుల్, మీనా కేఫ్,ఘరోండ, రోడ్డు నెం 1 ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు.