మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ దాయీబాగ్ హనుమాన్బాలాజీ ఆలయంలో గత ఐదురోజులుగా జరుగుతున్న 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఉదయం చక్రస్నానం చేసిన పండితులు మధ్యాహ్నం కుంకుమార్చనను నిర్వహించారు. చివరిరోజు పూజలలో నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి సీహెచ్.ఆనంద్కుమార్గౌడ్ పాల్గొన్నారు. ఉత్సవకమిటీ అధ్యక్షులు గొరిగె శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.