ఇచ్చోడ, అక్టోబర్ 1 : అందరి సంక్షమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెంచడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గిరిజనుల చిరకాల కోరికను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, నాయకులు మేరాజ్ అహ్మద్, వెంకటేశ్, ముస్తాఫా, అబ్దుల్ రషీద్, రాథోడ్ ప్రకాశ్, బల్గం రవి, భీముడు, గణేశ్, రాథోడ్ ప్రవీణ్, సోయం విశ్వనాథ్, శంకర్, విక్రమ్, శ్రీహరి, రమేశ్, కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 1 : ఆదివాసుల ఆత్మబంధు సీఎం కేసీఆర్ అని ఎంపీటీసీ కొడప అరుణ్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివాసీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్కు ఆదివాసులందరూ రుణపడి ఉంటామని అన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూముల విషయంలో కేంద్రం ఒప్పుకోకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు కూడ త్వరలోనే ఇస్తామని తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు జంగ్శౌవ్, తుకారాం, నాయకులు సోనేరావ్, సునీల్, కిష్టు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 1 : తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మండల కేంద్రంలో గిరిజనులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతూ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, సర్పంచ్లు జాదవ్ సుభాష్, విశాల్కుమార్, నాయకులు చంద్రశేఖర్యాదవ్, జాదవ్ మహేందర్, తులసీరాం, నారాయణ, గిరిజనులు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 1 : గిరిజనుల చిరకాల ఆకాంక్ష రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలో గిరిజన మహిళలు , రైతులు కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, దినేశ్, పురుషోత్తం, పాండురంగ్ పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 1: ఆదివాసీ గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మకమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని సొనాలలో ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో కుమ్రం భీం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పాలకవర్గ డైరెక్టర్ భూమన్న, పార్డీ(బీ) రాయిసెంటర్ పరిధిలోని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 1 : గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్ నాయకులు జగదీశ్, మెట్టు ప్రహ్లాద్, కొడప సోనేరావ్, జంగుబాపు, రమణ, గంగాధర్, కిషన్ పాల్గొన్నారు.
తలమడుగు, అక్టోబర్ 1 : మండలంలోని సుంకిడి గ్రామంలో టీఆర్ఎస్, గిరజన సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, ఝరి సహకార సంఘం అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఆశన్న యాదవ్, మగ్గిడి ప్రకాశ్, పొచ్చన్న, లక్ష్మణ్, కంది నర్సింహులు పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 1: సీఎం కేసీఆర్ గిరిజన పక్షపాతి అని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెందూర్ దేవన్న అన్నారు. గిరిజన రిజర్వేషన్ను 10 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేసిన సందర్భంగా మండలంలోని సాత్నాల, మాంగుర్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డైరెక్టర్ తానాజీ, సర్పంచ్లు జుగత్రావ్, శ్యాంసుందర్, శ్రీరాం, పెందూర్ భరత్, నర్సింగ్, మోహన్, లక్ష్మణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.