ముషీరాబాద్:ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్య రంగంలోని అన్ని ప్రక్రియలలో బముఖ ప్రజ్ఞాపాటవాలను ప్రదిర్శించిన మహోన్నత సాహితీవేత్త వనమామలై వరదాచార్యులు అని తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు జయంతి సభ శుక్రవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది.ఈ సందర్భంగా వరదాచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన సాహిత్య సృష్టితో అభినవ పోతన, కాళీదాసు బిరుదులు పొందిన ఘనత వనమామలైకే దక్కిందన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవి డాక్టర్ అప్పారావు, రచయిత రమణ వెలమకన్ని, అనురాధ తదితరులు పాల్గొన్నారు.