సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందని ఆందోళన చెందే కంటే.. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మేలని చెబుతున్నారు వైద్యులు. ఐదు రోజుల పాటు కొవిడ్ మందుల వాడకంపై ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి వాడకంపై ప్రత్యేక కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తూ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టింది. పాజిటివ్గా నిర్ధారణ జరిగిన వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే.. హోం ఐసొలేషన్ సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా చికిత్స పొందుతున్న వారికి ఇంటికే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ద్వారా పాజిటివ్ వ్యక్తులున్న ఇండ్లకు వెళ్లి వీటిని అందజేస్తున్నారు.
ఇవి తప్పనిసరి