కెరమెరి, మే 30: ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలు, పురుగు నివారణ మందులను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వాంకిడి సీఐ సుధాకర్ హెచ్చరించారు. స్థానిక పోలీ స్ స్టేషన్లో వ్యాపారులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే విక్రయించాలన్నారు. అంతేగాకుండా విత్తనాలు, ఎరువులకు సంబంధించిన ధరలు ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో రాయాలని, నాసిరకం విత్తనాలు, గడ్డి విత్తనాలు ఎవరైనా అమ్మినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేశ్, కెరమెరి వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, మే 30: నకిలీ విత్తనాలు, మందులు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కౌటాల సీఐ బుద్దే స్వామి ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. కౌటాల సర్కిల్లోని కౌ టాల, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాల్లో ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే వెంటనే ఫోన్ నంబర్ 9440795059 కు సమాచారం అందించాలని కోరారు.
జైనూర్, మే 30 : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని జైనూర్ సీఐ హనోక్ అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫర్టిలైజర్ షాపుల యజమానులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిషేధిత విత్తనాలు, పురుగు నివారణ మం దులు అమ్మితే శాఖ పరమైన చర్యలు తీసుకొని పీడీ యాక్టు న మోదు చేసి ఆరు నెలల పాటు బెయిల్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్ఐ తిరుపతి, మండల ఫర్టిలైజర్ షాపుల యజమానులు ఉన్నారు.