పాఠశాలల సమస్యలకు పరిష్కారం
ఇక ఏటా 40శాతం ఏసీడీపీ నిధులు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా రూ.2 కోట్లు
తీరనున్న మౌలిక సదుపాయాల సమస్య
ఎస్ఐఎస్తో పాఠశాలల స్థితిగతులు
నమోదు చేస్తున్న విద్యాశాఖ
నాగర్కర్నూల్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. బడుల్లోని చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ఏండ్ల తరబడి ఎదురు చూసే రోజులు పోయాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గ స్థాయిలోనే సమస్యలు తీరనున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలనిధుల నుంచి 40 శాతం చొప్పున సరస్వతి నిలయాలకు ఖర్చు చేసేలా ఇచ్చిన ఆదేశాలు త్వరలో అమలుకానున్నాయి. దీంతో పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పన సులభంగా మారనున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న విధానపర నిర్ణయంతో బడులకు మం చి రోజులు రానున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధు ల్లో 40 శాతం పాఠశాలల బాగునకు వెచ్చించనున్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిధులతో బడుల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అ యితే, సీఎం నిర్ణయంతో ఇకపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభివృద్ధి నిధుల్లో 40 శాతం అంటే రూ.2 కోట్ల వరకు కచ్చితంగా విద్యాసంస్థల సమస్యలు తీర్చేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రానున్న మూడేండ్లలో విద్యా సంస్థలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకుగానూ రాష్ట్రంలో రూ.6వేల కోట్లను వె చ్చిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం విశేషం. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు సమస్యలను గుర్తిస్తున్నారు. గతంలో యూడైస్, శాలసిద్ధి ద్వారా సేకరించిన సమస్యల మా దిరిగానే స్కూల్ ఇన్ఫ్రా స్టేటస్ (ఎస్ఐఎస్) పేరిట పాఠశాలల స్థితిగతులను అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు పక్కా భవనాలు ఉన్నాయి. అయితే, అదనపు గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీరు, వంట గదులు, ప్ర హరీ వంటి సమస్యలు ఉన్నాయి. ఇలాంటి వాటి పరిష్కారాని కి హెచ్ఎంలు, ఎంఈవోలు ఉన్నతాధికారులకు సమస్యలను నివేదించడం, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. దీంతో సమస్యలు ఆలస్యంగా పరిష్కారమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ నియోజకవర్గ నిధుల్లో 40 శాతం చొప్పున వె చ్చించాలనే నిబంధన విధించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించనుండడంతో సమస్యల పరిష్కారంతోపాటు పర్యవేక్షణ పెరగనున్నది. సీఎం నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమ వుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలోని కొ ల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, క ల్వకుర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలకుతోడు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలో 862 పాఠశాలలు ఉన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో కలి పి 1200 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ప్రతి ఏడాది రూ.14 కోట్లు ఖర్చు కానున్నాయి.
సమస్యలు పరిష్కారమవుతాయి..
ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, అదనపు గదులు, తాగునీటి కనెక్షన్ల ఇబ్బందులు ఉన్నాయి. ఏసీడీపీ నిధుల్లో రూ.2 కోట్లు ప్రతి ఏడాది మంజూరు కావడంతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనున్నది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమస్యలను నివేదించి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం.