వెనుకబడిన వర్గాలకు అండగా నిలువాలి
కలెక్టర్ వెంకట్రావు
కేసుల పరిష్కారంలో ప్రగతి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 29 : న్యాయసేవా సంస్థ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సంస్థ కా ర్యాలయంలో సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యామమూర్తి ప్రేమావతి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా న్యాయ సేవా సంస్థ స్టాట్యుటరీ బాడీ సమావేశానికి కలెక్టర్తోపాటు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి వెంకట్రా వు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జిల్లా న్యాయ సేవా సంస్థ అందించిన ఉచిత న్యాయ సహాయం, వాటికి సంబంధించిన కేసుల వివరాలపై స మీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లా న్యాయ సేవా సంస్థ మహిళలు, పిల్లలు ఇతర సామాజికంగా, ఆర్థికం గా వెనుకబడిన వర్గాల వారికి అండగా నిలువాలని, వారికి చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ ప్రేమావతి మాట్లాడుతూ లోక్ అదాలత్లో వివిధ పక్షాలు భాగస్వాములు కావడంవల్ల కేసుల పరిష్కారంలో మంచి ప్రగతి కనబడుతుందన్నారు. ఇందుకు అన్ని ప్రభు త్వ శాఖలు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ల కృషి అమోఘమన్నారు. ఈ సందర్భంగా ఎస్పీని అభినందించారు. ఇంకముందు కూడా కేసుల పరిష్కారంలో మరింత చొరవ చూపాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ న్యాయవాది మనోహర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలగంగాధర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంతు, రెడ్క్రాస్ సంస్థ చైర్మ న్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.