కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ఔట్ ఆఫ్ టర్న్ పద్ధతిలో నిర్మాణం చేయాలని సూచన
రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించినట్లు వెల్లడి
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ రాసిన లేఖపై స్పందించిన మంత్రి
కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్-మం చిర్యాల వయా చొప్పదండి స్టేట్ హైవే లెవల్ క్రాసింగ్ నంబర్ 18 కి.మీ. 35/5-6 కరీంనగర్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధి తీగలగుట్టపల్లి వద్ద ఫోర్ లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ( ఆర్వోబీ ) పనులను ఔట్ ఆఫ్ టర్న్ (ఓఓటీ ) ప్రాతిపదికన వెంటనే చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సునీత్శర్మను కోరారు. ఈ మేరకు శనివారం మంత్రి లేఖ రాశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కు మార్ రాసిన లేఖకు రాష్ట్ర మంత్రి ప్రశాం త్రెడ్డి స్పందించి రైల్వే బోర్డు చైర్మన్కు లేఖ పంపారు. ఆర్వోబీ పనుల కోసం అయ్యే పూర్తి ఖర్చులో సగభాగం భరిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉం దని మంత్రి ఆ లేఖలో సునీత్శర్మకు తెలిపారు. రాష్ట్రంలో ఆర్వోబీల నిర్మా ణం కోసం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించిన విషయా న్ని గుర్తు చేశారు. ప్రయాణికుల తో సహా వ్యాపారపరంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ క్రియాశీలకంగా మారిందని, రైలు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని రెండు లేన్లకు బదులుగా ఫోర్ లేన్ల ఆర్వోబీ పనులకు మంజూరు ఇవ్వాలని మంత్రి ప్రశాంత్రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రాసిన లేఖపై స్పందిం చిన దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ రమణారెడ్డి ఇటీవలే సమగ్ర నివేదికను అందించిన విషయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సునీత్శర్మకు గుర్తు చేశారు. తక్షణమే రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించాలని మంత్రి ప్రశాంత్రెడ్డి, బోయినపల్లి వినోద్కుమా ర్ రైల్వే బోర్డు చైర్మన్ను కోరారు.