గోదావరిఖని, మే 29: దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 70మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ రూ. 300 పింఛన్ను రూ.3వేలకు పెంచి గౌరవంగా జీవించేలా తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మంత్రి కొప్పుల ఈశ్వర్ దివ్యాంగులు స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు మంజూరు చేస్తున్నారని వివరించారు. ఇక్కడ మేయర్ అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, కొమ్ము వేణు గోపాల్, సర్పంచులు ధర్మాజీ కృష్ణ, సతీశ్, అధికారులు లక్ష్మీనారాయణ, స్వరూపారాణి తదితరులు ఉన్నారు.
బాల్క సుమన్కు పరామర్శ
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేశ్ అకాల మృతి చెందగా శనివారం ఆయన స్వగ్రామం రేగుంటలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ మేయర్ లక్ష్మీనారాయణ, గోపాల్ రావు ఉన్నారు.
మనోధైర్యం నింపేందుకే..
కరోనా బాధితులకు మనోధైర్యం నింపేందుకు భరోసా యాత్ర చేపట్టానని ఎమ్మెల్యే తెలిపారు. 45వ డివిజన్లో భరోసా యాత్ర నిర్వహించారు. బాధితుల ఇంటికి వెళ్లి నిత్యావసరాలు, పౌష్టికా హారం, పండ్లు పంపిణీ చేశారు.
లీకేజీ కాకుండా చర్యలు చేపట్టాలి
ఫర్టిలైజర్సిటీ, మే 29: ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియా గ్యాస్ లీకేజీ గాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్ఎఫ్సీఎల్ ఇన్చార్జి ఈడీ విజయ్కుమార్ బంగార్తో మాట్లాడారు. ఎరువుల ఉత్పత్తి సమయంలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి అస్వస్థతకు గురైతే చికిత్స అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేవన్నారు. యూరియా ప్లాంట్లో స్లేర్ స్టాక్ లేకపోవడం మూలంగా అమ్మోనియా గాలిలోకి వెళ్తుందన్నారు. సర్టిఫైడ్ సేఫ్టీ స్టాఫ్ లేరని, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.