కరోనా కట్టడిలో ముందుండి సేవలు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి అల్లోల సురేందర్రెడ్డి అన్నదానం
నిర్మల్ అర్బన్, మే 29 : కరోనా కట్టడిలో ఫ్రం ట్లైన్ వారియర్స్ సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మహమ్మారి పోరులో ప్రాణాలకు తెగించి సేవలందించిన మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బందికి మంత్రి సోదరుడు అల్లోల సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. స్థానిక మున్సిపల్, జిల్లా దవాఖానలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మం త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నుంచి ప్ర జలను కాపాడుతున్న పారిశుధ్య కార్మికులు.., వైరస్ను అడ్డుకట్ట వేయడంతోపాటు బాధితులకు మె రుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బం ది.., లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్న పోలీసుల సేవలు మరువలేనివన్నారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రతి ఒ క్కరూ పాటించాలని సూచించారు. రెండు, మూ డ్రోజుల్లో ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలైన వెయ్యి మందికి రూ.1000కి సరిపడా ని త్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు చె ప్పారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు, జిల్లా దవాఖాన వద్ద వైద్యులు, సిబ్బందికి, రోగులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో మం త్రి సోదరులు అల్లోల సురేందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ యువనేత అల్లోల గౌతం రెడ్డి, కు టుంబసభ్యులు అల్లోల రాజ్కిరణ్ రెడ్డి, నితీశ్ రె డ్డి, రేవంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్క డే, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ముత్యం రెడ్డి, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎంసీహెచ్ దవాఖానలో పనుల పరిశీలన..
నిర్మల్ చైన్గేట్, మే 29 : నిర్మల్లోని ఎంసీహెచ్ దవాఖానలో వంద పడకల నిర్మాణ పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మంత్రి అల్లోల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. వందపడకల నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎంహెచ్వో ధన్రాజ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, వైద్యాధికారులు రజని, స్వర్ణ, నాయకులు తదితరులు ఉన్నారు.