బెల్లంపల్లిరూరల్, మే 29 : సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారందరికీ టీకా వేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ వైద్య సిబ్బందికి సూచించారు. బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సినేషన్ను శనివారం ఆయన పరిశీలించారు. పాత్రికేయులు, రేషన్డీలర్లు, గ్యాస్ఏజెన్సీ నిర్వాహకు లు, సిబ్బంది వారి కుటుంబసభ్యులకు టీకా అం దేలా చూడాలని స్థానిక తహసీల్దార్ కుమారస్వామిని ఆదేశించారు.
దండేపల్లి, మే29: మండల కేంద్రంలోని పీహెచ్సీలో వ్యాక్సినేషన్ను మంచిర్యాల అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారులు సునీల్, అరుణ, వైద్య సిబ్బంది ఉన్నారు.
లక్షెట్టిపేట రూరల్, మే 29 : పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలన్నారు. అనంతరం దవాఖాన పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, సూపరింటెండెంట్ కుమార స్వామి, డాక్టర్లు రాకేశ్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.