కొత్తకోట, జూలై 28 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మిరాసిపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సభకు రైతుబంధు మండలాధ్యక్షుడు కొండారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 14 లక్షల మంది కుటుంబాలుండగా ఇప్పటికి 80 లక్షల రేషన్కార్డులు ఉన్నాయని, కొత్తగా 3లక్షల రేషన్ కార్డులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. రేషన్కార్డులు అవసరంలేని వారు వాపసు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో కొత్త పింఛన్లు అందుతాయన్నారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24వేల పింఛన్లు ఉన్నాయని, ఇప్పుడు 41వేల పింఛన్లు ఉన్నట్లు తెలిపారు. పేదవారికి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ రైతులతోపాటు పేద ప్రజల కడుపు నింపుతున్న దేవుడన్నారు. సహాయం, పథకాలు పొందుతున్న వారు సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాలన్నారు. కొత్తకోట, మదనాపురం మండలాల్లో ఆరు చెక్డ్యాంలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. అనంతకుముందు మిరాసిపల్లి గ్రామానికి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, రైతుబంధు మండలాధ్యక్షుడు కొండారెడ్డి, తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొవచ్చిన గజమాలతో సత్కారించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధికారి ప్రశాంత్, జెడ్పీటీసీ కృష్ణయ్యయాదవ్, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సింగిల్విండో చైర్మన్ వాసుదేవారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు భీంరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, అయ్యన్న, శ్రీను, రాములుయాదవ్, శ్రీనుజీ, సుభాశ్, ఖాజామైనొద్దీన్, బాలకృష్ణ, తిరుపతయ్య, హనుమంతుయాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.