రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్
తలకొండపల్లి, జూలై28: దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం తలకొండపల్లి మండల కేంద్రంలో ఆర్డీవో శ్రీనివాసచారి ఆధ్వర్యంలో 309 రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఉచిత 24గంటల విద్యుత్, రైతుబీమా, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ర్టా న్ని బంగారు తెలంగాణ చేయడానికి సీఎం అ హర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నా రు. రెండేండ్లలో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలో ని ప్రతి ఎకరాకు సాగు నీరు అందజేస్తామన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎం పీడీవో రాఘవులు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రహమాన్, సర్పంచ్లు స్వప్న భాస్కర్రెడ్డి, చంద్రయ్య, రమేశ్, రమేశ్యాదవ్, లలిత, కుమార్, లింగమ్మ, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింహ, నాయకులు యాదగిరి, శ్రీశైలం, లక్ష్మీకాంత్గౌడ్, జగన్రెడ్డి, ఆరై గోపాలకృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు.