వైద్య సిబ్బంది విధిగా హాజరుకావాలి
కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి జంక్షన్ మే 28: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని జూనియర్ కళాశాలలో సూపర్ స్పైడర్ల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సంబంధిత రికార్డులు, వ్యాక్సినేషన్ అమలు తీరును పరిశీలించారు. సెంటర్కు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరయ్యారా? లేదా ? అధికారుల పర్యవేక్షణపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది విధిగా విధులకు హాజరు కావాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ సెంటర్లో 585 మందికి టీకా వేయాలని నిర్ణయించారు. మొదటి రోజు శుక్రవారం 221 మందికి వ్యాక్సిన్ వేశామని వైద్యులు తెలిపారు. ఇక్కడ డాక్టర్ శిరీష, ఏహెచ్ఈవో ఉమామహేశ్వర్, వైద్య సిబ్బంది ఉన్నారు.
కమాన్పూర్, మే 28: మండలంలోని సిద్దిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సిన్ కేంద్రంలో ఎంత మందికి టీకాలు వేశారు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెం ట తహసీల్దార్ ఉమా శంకర్, ఆర్ఐ బండి పోచం, డాక్టర్ అశోక్కుమార్, సర్పంచ్ తాటికొండ శంకర్, ఎంపీటీసీ బోనాల వెంకటస్వామి, ఉప సర్పంచ్ జాబు సతీశ్, ఏవో బండి ప్రమోద్కుమార్ తదితరులు ఉన్నారు.
రామగిరి మే 28 : బేగంపేటలోని ఆరోగ్య ఉప కేంద్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. టీకా కోసం నమోదు చేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, ప్రత్యేకాధికారి సమ్మయ్య, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో విజయకుమార్, వైద్యాధికారి నాగశిరోమణి, సర్పంచ్ బుర్ర పద్మ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, మే 28: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి రంగారెడ్డి పరిశీలించారు. అధికారులు మండల వ్యాప్తంగా 108 మందిని గుర్తించగా, మొదటి రోజు 54 మంది టీకాలు తీసుకున్నారని వెల్లడించారు. ఇక్కడ తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఇన్చార్జి వైద్యాధికారి రత్నాకర్, ఎంపీవో రమేశ్, ఆత్మ బీటీఎం భూపతిరావు, వీఆర్వోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
సుల్తానాబాద్, మే 28: సుల్తానాబాద్ జడ్పీహెచ్ఎస్ (బాలుర) పాఠశాలలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేశ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, తహసీల్దార్ పాల్సింగ్, ఎంపీడీవో శశికళ, నాయకులు ముత్యం రమేశ్ తదితరులున్నారు.
ఎలిగేడు, మే 28: సూపర్స్పైడర్లకు ఎలిగేడు హైస్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాలను పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్ శుక్రవారం సందర్శించారు. క్రమపద్ధతి ప్రకారంగా అందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. కరోనాను అంతం చేసే దాకా అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వివరించారు. ఇక్కడ తహసీల్దార్ పద్మావతి, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, మెడికల్ సూపర్వైజర్ గంగమరాజు ఇతర అధికారులు ఉన్నారు.
మంథని టౌన్, మే 28: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని వ్యాక్సినేషన్ సెంటర్లో 121 మందికి టీకాలు వేసినట్లు డాక్టర్ శంకరాదేవి తెలిపారు. వ్యాక్సిన్ ప్రక్రియను జిల్లా వైద్యాధికారి ప్రమోద్కుమార్, జడ్పీసీఈవో శ్రీని వాస్, తహసీల్దార్ వేణుగోపాల్ పర్యవేక్షించారు.
ధర్మారం,మే28: నంది మేడారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో సుమారు 75 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ సంపత్రెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మండల ప్రత్యేక అధికారులు ఎం నాగైలేశ్వర్, కే రవి శంకర్, తహసీల్దార్ పీ సంపత్, ఎంపీడీవో జయశీల, నందిమేడారం ప్యాక్స్ చైర్మ న్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ శిబిరంలో కళాశాల ప్రిన్సిపాల్ శైలజ, డాక్టర్ అమర్నాథ్, హెచ్ఈవో రమణారెడ్డి, నందిమేడారం, ధర్మారం ఎంపీటీసీ తుమ్మల రాంబాబు పాల్గొన్నారు.
ఓదెల, మే28: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో వ్యాక్సిన్ వేశారు. ఇక్కడ డీపీవో గీత, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీడీవో సత్తయ్య, మాజీ సర్పంచ్ మహేందర్ ఉన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మే28: మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో 99 మందికి వ్యాక్సిన్ వేసినట్లు హెచ్ఈవో సుధాకర్ తెలిపారు. ఇక్కడ ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, డీఏవో తిరుమల్ప్రసాద్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో కిషన్ ఉన్నారు.
ముత్తారం, మే28: ప్రభుత్వ దవాఖానలో వైద్యాధికారి వంశీకృష్ణ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశా రు. ఈ సందర్భంగా ఎంపీపీ జక్కుల ముత్తయ్య వ్యాక్సిన్ వేసుకొని మాట్లాడారు.