మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
నిత్యావసరాలు అందజేత.. అన్నదానం
దండేపల్లి, మే 28 : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట గిరిజన గూడెంలోని 100 కుటుంబాలకు పత్తిపాక సత్తయ్య స్మారకార్థం తనయుడు సంతోష్ అందజేస్తున్న నిత్యావసర సరుకులను ఎ మ్మెల్యే పంపిణీ చేశారు. సంతోష్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సమయంలో పేదలకు తమవంతుగా సాయం చేయాలన్నారు. దమ్మన్నపేట గిరిజన గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం చాలా సంతోషకరమని పే ర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, సర్పంచ్ గడ్డం రాజయ్య, ఉపసర్పంచ్ నలిమెల మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, నాయకులు ఎల్తపు సుభాష్, పత్తిపాక శ్రీనివాస్, గాలిపెల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
అన్నదానం చేయడం గొప్ప..
మంచిర్యాలటౌన్, మే 28 : కరోనా లాక్డౌన్ సమయంలో రోగులు, వారి సహాయకులకు నిత్యం అన్నదానం చేయడం అభినందించాల్సిన విషయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. టీఆర్ఎస్ యూత్ నాయకుడు తూముల నరేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలోని రోగులకు, వారి సహాయకులకు శుక్రవారం ఎమ్మెల్యే అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించాల్సిన విషయమన్నారు. లాక్డౌన్ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వస్తారని, వీరికి భోజనం దొరకక ఇబ్బందులు పడాల్సి వస్తుండడాన్ని గమనించిన టీఆర్ఎస్ యూత్ నాయకులు తూముల నరేశ్ మంచి నిర్ణయం తీసుకొని సేవకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ వైస్చైర్మన్లు ముఖేశ్గౌడ్, తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, మహేశ్, శివ, నాని, సాయారోషన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.