నిర్మల్ డీపీవో వెంకటేశ్వర్రావు
వ్యాక్సినేషన్ కేంద్రం పరిశీలన
పల్లె ప్రగతి పనులు, నర్సరీలు..
కుభీర్, ఏప్రిల్ 28 : వ్యాక్సిన్తోనే కరోనాను కట్టడి చేయవచ్చని నిర్మల్ డీపీవో వెంకటేశ్వర్రావు అన్నారు. ఇందుకు మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కుభీర్ పీహెచ్సీలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బుధవారం ఆయ సందర్శించారు. అనంతరం టీకా వేసుకున్న వారి జాబితాను పరిశీలించి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుభీర్లోని పల్లె ప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించి, ఎండిపోకుండా కాపాడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రాంనాయక్ తండా, డోడర్న తదితర గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ రెండోవారం లోగా నర్సరీల్లోని మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీవో ఆసూరి గోవర్దన్, జేపీఎస్లు, సర్పంచ్లు శంకర్ రాథోడ్, జాదవ్ శంకర్, నాయకులు పీ విజయ్కుమార్, విక్రం, ప్రకాశ్ ఉన్నారు.