టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
80 మందికి కల్యాణలక్ష్మి సాయం
ధర్మారం, మే27: కరోనా కష్ట కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 80 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి ద్వారా ఒక్కొకరికీ రూ. 1,00, 116 చొప్పున రూ. 80,09,280 సొమ్ము మంజూరయ్యాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు గురువారం ధర్మారంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సంపత్ ఆధ్వర్యంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలుపై సీఎం కేసీఆర్ చిత్తశుద్దికి నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రి ఈశ్వర్ అర్హులకు ప్రభుత్వం ద్వారా లబ్ధికూరేలా కృషి చేస్తున్నారని వివరించారు. సాయం అందించిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
జూలపల్లి, మే 27: కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పేదలకు వైద్య ఖర్చులు అందిస్తూ ఆదుకుంటున్నారని ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం తెలిపారు. అబ్బాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురికి రూ. 75 వేలు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య ఖర్చులు మంజూరు చేసింది. ఈ క్రమంలో పెద్దిరెడ్డి హరీశ్కు రూ. 31 వేయి, అర్కోల్ల శ్రీనివాస్కు రూ. 30 వేలు, నిట్టు వెంకటేశ్కు రూ. 14 వేల చెక్కులను గురువారం వెంకటేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కేసీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. జూలపల్లి గ్రామానికి చెందిన కొండ రవీందర్కు రూ.37 వేలు, పిట్టల సమతకు రూ. 25 వేల చెక్కులను ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పులకు లబ్ధిదారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పత్తిపాక సింగిల్ విండో డైరెక్టర్ జంగం సతీశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కచ్చు బీరయ్య ఉన్నారు.