జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు
అకారణంగా బయటకు వచ్చిన వారిపై పోలీసుల చర్యలు
ఐసొలేషన్ కేంద్రాలకు 84 మంది తరలింపు
కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసిన సిబ్బంది
68 వాహనాలు సీజ్
గర్మిళ్ల, మే 27 : ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను మంచిర్యాల జిల్లా పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డెక్కిన ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నారు. వారిని బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి, హెచ్చరించి వదిలేశారు. ఇందులో భాగంగా మంచిర్యాల పట్టణంలో గురువారం ఏసీపీ అఖిల్ మహాజన్, రూరల్ సీఐ కుమారస్వామి, సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. గల్లీల్లో బైక్పై కలియ తిరిగారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన 10 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని.. వ్యాన్లో బెల్లంపల్లిలోని ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. 13 వాహనాలను సీజ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో మధ్యాహ్నం 12 గంటలకు ఓ వ్యక్తి కనిపించగా, ఎందుకు బయటకు వచ్చా వు అని ఏసీపీ ప్రశ్నించగా.. వాకింగ్ కోసమని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ టైమ్లో ఎవరైనా వాకింగ్ చేస్తారా అని మందలించారు. తాను హార్ట్ పేషెంట్నని అందుకే వచ్చానని సమాధానం చెప్పడంతో ఏసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని సెల్ఫోన్, కారును పోలీస్స్టేషన్కు తరలించారు. ఏసీపీ మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ నియమ నిబంధనలు పాటించాలని పోలీసులు పదేపదే చెబుతున్నా కొంతమంది ఆకతాయిలు ఏదో ఒక కారణం చెబుతూ ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారన్నారు. సడలింపు సమయంలో బయటకు వచ్చే వారు మాస్కు ధరిం చి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
బెల్లంపల్లిలో 20 మంది..
బెల్లంపల్లిరూరల్, మే 27: బెల్లంపల్లి పట్టణంలో గురువారం ఏసీపీ రహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకుని వ్యాన్లో కొవిడ్ ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. 3 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని ఇకపై ఐసొలేషన్ కేంద్రానికి తరలించి లాక్డౌన్ ముగిశాక విడిచి పెడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ లు జగదీశ్, రాజు, టూటౌన్, వన్టౌన్ ఎస్ఐలు భాస్కర్రావ్, రాములు పాల్గొన్నారు.
చెన్నూర్లో 14 మంది..
చెన్నూర్, మే 27: చెన్నూర్ పట్టణంలో గురువారం ఏసీపీ నరేందర్ లాక్ డౌన్ను పర్యవేక్షించారు. అకారణంగా బయట తిరుగుతున్న 14 మందిని బెల్లంపల్లి ఐసొలేషన్కు తరలించారు. ఏడు వాహనాలను సీజ్ చేశారు. ఏసీపీ నరేందర్ మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు వినోద్, విక్టర్ పాల్గొన్నారు.
జైపూర్లో 16 మంది..
జైపూర్, మే 28: జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జైపూర్, రసూల్పల్లి, నర్వ, వెంకట్రావుపల్లి, ఇందారం క్రాస్రోడ్డులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 16 మంది ఆకతాయిలను పట్టుకొని బెల్లంపల్లి ఐసోలేషన్కు తరలించారు. 14 వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
లక్షెట్టిపేటలో ఆరుగురు..
లక్షెట్టిపేట రూరల్, మే 27 : పట్టణంలో సీఐ నారాయణ్ నాయక్ లాక్డౌన్ను పర్యవేక్షించారు. అనవసరంగా తిరుగుతన్న ఆరుగురిని బెల్లంపల్లిలోని ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. 13 వాహనాలను సీజ్ ఏశారు. ఎస్ఐ చంద్రశేఖర్, పీఎస్ఐ హైమ, దండేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ ఉన్నారు.
శ్రీరాంపూర్లో 18 మంది..
శ్రీరాంపూర్, మే 27 : శ్రీరాంపూర్లో గురువారం సీఐ తోట సంజీవ్, ఎస్ఐ మంగీళాల్ కొత్తరకం శిక్ష అమలు చేశారు. ఉదయం పది గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన 18 మంది యువకులను అదుపులోకి తీసుకొని బెల్లంపల్లి ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. 18 మంది వాహనాలను సీజ్ చేశారు.