హాజరుకాని అధికారులపై చర్యలు తప్పవు
అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి
సూర్యాపేట, అక్టోబర్ 25 : వివిధ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలో ఉన్న అధికారులు తప్పక హాజరుకావాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి అన్ని గ్రామా లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షించాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో కరోనా వ్యాక్సినేషన్ నూరుశాతం పూర్తయ్యేలా కృషిచేయాలన్నారు. ప్రజా వాణిలో మొత్తం 120దరఖాస్తులు అందాయని ఆయా శాఖల అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, పీడీ కిరణ్కుమార్, సీపీఓ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, ఈడీ శిరీష, అధికారులు పాల్గొన్నారు.