గోదావరిఖని, జూన్ 25: నూతన ప్రాజెక్టుల కార్యాచరణ ప్రణాళికలపై సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం, డీ సత్యనారాయణ రావుతోపాటు మైనింగ్ అడ్వైజర్, జీఎం సీపీఅండ్పీ, జీఎం మార్కెటింగ్ తదితర ఉన్నతాధికారులు సమీక్షించారు. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల జీఎంలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. సంస్థ భవిష్యత్లో నూతన ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్ల పనులు, భూ సేకరణ అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. ఆర్జీ-1లో ఓసీపీ-5 కోసం చేపడుతున్న పనులు, ప్రస్తుత పురోగతి, రోడ్లు, నాళాల మళ్లింపు పనులు, మైనింగ్ లీజు, ప్రభుత్వం నుంచి పొందే అనుమతులు ఇతర పనులపై డైరెక్టర్లు జీఎంలకు వివరించారు. కార్యక్రమంలో ఆర్జీ-1 జీఎం నారాయణ, మేడిపల్లి పీవో సత్యనారాయణ ఉన్నారు.
యైటింక్లయిన్కాలనీ, జూన్ 25 : ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 సీహెచ్పీ పురోగతిపై కార్పొరేట్ సీహెచ్పీల జీఎం స్వామినాయుడు, జీఎం టీ వెంకటేశ్వరావు, ఇతర అధికారులతో వీసీ నిర్వహించారు. కొత్తగూడెం కార్పొరేట్ నుంచి వీసీలో కార్పొరేట్ సీహెచ్పీల జీఎం ఓసీపీ-3 సీహెచ్పీలో 4వ ట్రాక్ సైలో బంకర్ నిర్మాణంపై చర్చించారు. నాల్గో బంకర్ నిర్మించే ఆవశ్యకత, నిర్మాణ సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, సివిల్ డీజీఎం ధనుంజయ్, సీహెచ్పీ ఎస్ఈ సదానందం, అధికారి ప్రతినిధి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, జూన్ 25: పురోగతిలో ఉన్న నూతన ప్రాజెక్టులు, కొవిడ్ వ్యాక్సినేషన్, హరితహారం తదితర అంశాలపై సంస్థ డైరెక్టర్లు సమీక్షించారు. ఈ మేరకు జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఆర్జీ-3 ఏరియాలోనీ ఓసీపీ-1 విస్తరణ అభివృద్ధి పనులు, కొవిడ్ వ్యాక్సినేషన్తోపాటు ఈ సంవత్సరం హరితహారం ద్వారా ఏరియాలో చేపట్టబోతున్న ప్రణాళికలపై జీఎం మనోహర్ వివరించారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ రఘు కుమార్ తదితరులున్నారు.