రిపీటెడ్ నేరస్తులపై పీడీయాక్టు నమోదు
వచ్చే నెల15లోగా సీసీ కెమెరాలను జియోట్యాగింగ్ చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
కమిషనరేట్లో సిబ్బందితో సమావేశం
హన్మకొండ సిటీ, జూన్ 25: రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పోలీస్ అధికారులను ఆదేశించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా శుక్రవారం సెంట్రల్ జోన్ అధికారులతో కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో పలుమార్లు నేరాలకు పాల్పడే నేరస్తులపై పీడీ యాక్టు నమో దు చేసేందుకు అధికారులు పరిశీలించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. నేరాల నియంత్రణ కోసం ప్రజల భాగస్వామ్యంతో నెలకొల్పబడిన సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు జియోట్యాగింగ్ చేయాలన్నారు. సెంట్రల్ జోన్ పరిధిలోని సీసీ కెమెరాలను వచ్చే15లోగా జియోట్యాగింగ్ చేయాలన్నా రు. న్యూసెన్స్ కేసులను సిటీ పోలీస్ యాక్టు కింద నమో దు చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలపై విశ్లేషణ జరిపి ముందస్తు చర్యలు చేపట్టాలన్నా రు. వర్టికల్ విధానం, బ్లూకోల్ట్స్ సిబ్బంది, పెట్రోకార్ సిబ్బంది పనితీరు, స్టేషన్ పరిధిలోని రౌడీషిటర్ల పా యింట్ బుక్లను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలన్నారు. వారంలో ఒక రోజు కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందితో సమావేశమై ప్రస్తుత కేసుల స్థితిగతులపై చర్చించి, నేరస్తులకు శిక్ష పడేందుకు అవసరమైన ఆధారాలను కోర్టు అందజేయా ల్సిన బాధ్యత స్టేషన్ అధికారులపై ఉందన్నారు. ఎవరికి అప్పగించిన విధులు వారు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వా రా ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సెంట్రల్జోన్ డీసీపీ పుష్ప, హన్మకొండ, వరంగల్ , కాజీపేట, క్రైం ఏసీపీలు జితేందర్రెడ్డి, గిరికుమార్, రవీందర్కుమార్, బాబురావు పాల్గొన్నారు.