మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ప్రారంభం
మంచిర్యాల అర్బన్, జూన్ 24 : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించి, మనోధైర్యం నింపుతున్న స్వేరోస్ సభ్యుల సేవలు అభినందనీయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. స్వేరోస్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సహకారంతో లైఫ్లైన్ లీగ్ ఆధ్వర్యంలో జిల్లాకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, 50 పల్స్ ఆక్సీమీటర్లు, 50 థర్మామీటర్లు అందించగా, గురువారం తన నివాసంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర్రావు మాట్లాడుతూ.. స్వేరోస్ సంస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతరం కరోనాతో బాధపడుతున్న చెన్నూర్కు చెందిన ఓ వ్యక్తికి ఆక్సిజన్ అవసరమవగా, ఆ ప్రాంత స్వేరోస్ హెల్త్ వారియర్ దాసరి మల్లేశ్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఆక్సీ మీటర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా కో ఆర్డినేటర్ బన్న లక్ష్మణ్దాస్, సర్కిల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల శ్రీనివాస్ రావు, మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు గొడిసెల రాజేశం, ఉపాధ్యక్షుడు ఎర్రం సుధాకర్, స్వేరోస్ తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్(టీఎస్పీఏ) అధ్యక్షుడు గరిసె రవీందర్, దాసరి మల్లేశ్, మెడపట్ల మల్లేశ్, నిట్టూరి సారయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.