సిరిసిల్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 2,11,721 క్వింటాళ్ల సేకరణ
ముగిసిన కొనుగోళ్లు
సర్వత్రా హర్షం
సిరిసిల్ల రూరల్, జూన్ 23: సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించి ఆదర్శంగా నిలిచింది. 16కేంద్రాల ద్వారా 2,11,721 క్విం టాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు చైర్మన్ బండి దేవదాస్గౌడ్తోపాటు డైరెక్టర్లు నిత్యం సెంటర్లను పర్యవేక్షిస్తూ, సమస్యలను పరిష్కరించడంతో ధాన్యం సేకరణ వేగవంతమైంది. కొవిడ్ జాగ్రత్తలు పాటి స్తూ, నియోజకవర్గంలోనే రికార్డు స్థాయిలో వడ్లు కొనడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నియోజకవర్గంలోనే టాప్..
సిరిసిల్ల సింగిల్విండో ధాన్యం కొనుగోళ్ల సేకరణలో సిరిసిల్ల నియోజకవర్గంలోనే టాప్లో నిలిచింది. విండో పరిధిలో 16 కేంద్రాలను ఏర్పాటు చేసి, 18 లారీలను కేటాయించారు. 16 సెం టర్లలో 2,760 మంది రైతుల నుంచి 2లక్షల 11వేల 721 క్వింటా ళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో వారంలోగా రూ.39 కోట్ల 97లక్షల 29వేల248 నగదు జమ చేశారు. గత యాసంగి కంటే రెట్టింపు ధాన్యాన్ని కొనడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యానికి మించి కొన్నాం..
ఈ యాసంగిలో రెట్టింపు స్థాయిలో ధాన్యాన్ని సేకరించడం సంతోషంగా ఉంది. 16 సెంటర్ల ద్వారా 2లక్షల 11 వేల 721 క్వింటాళ్ల ధాన్యాన్ని కొన్నాం. ధాన్యం సేకరణలో సహకారం సంఘం నియోజకవర్గంలోనే టాప్లో ఉన్నది. అందరి సహకారంతోనే ధాన్యం సేకరణను పూర్తి చేశాం. ధాన్యం కొనుగోలుకు సహకరించిన మంత్రి కేటీఆర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, రైతులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు.