రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్లో బంకెట్ హాల్ ప్రారంభం
నిర్మల్ అర్బన్, జూన్ 23 : నిర్మల్ జిల్లాతోనే వ్యాపార రంగం రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్నదని, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండే సదుపాయాలు ఇప్పుడు ఇక్కడే సమకూర్చుతుండడం గర్వకారణమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూ తనంగా నిర్మించిన ఉమామహేశ్వర బంకెట్ హాల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. బంకెట్ హాల్ను పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన ప్రశాంత వా తావరణంలో నిర్మించిన నవీన్ గోల్డ్ బ్రదర్స్ను అభినందించారు. జిల్లా ఏర్పాటుతోనే నిర్మల్ అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. మహానగరాల్లో ఉండే సదుపాయాలతో షాపింగ్మాల్లు, బట్టల దుకాణాలు, ఫంక్షన్ హాల్లు ఇప్పుడు ఇక్కడే ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉం దని పేర్కొన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్క నాటి నీళ్లుపోశారు. బోథ్ ఎమ్మెల్యే బాపురావ్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, కాళేశ్వర ఆలయ చైర్మన్ కొరిపెల్లి దేవేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, కడారి నరేశ్, నవీన్, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, లక్కాకుల నరహరి పాల్గొన్నారు.