నార్నూర్, మే 23 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం స క్కు అధికారులకు సూచించారు. గాదిగూడతో పా టు పిప్రి, చిత్తగూడ, ఝరి, లోకారి(కే) గ్రామాల్లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లేతో కలిసి ఆదివారం ఆయన పర్యటించారు. గాదిగూడ, దాబా, ఉమ్రి గ్రామాల వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ప రిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. సకాలంలో నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. అలాగే గాదిగూ డ, ఝ రి పీహెచ్సీ సందర్శించారు. కరోనా ని యంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు.
పరామర్శలు
జైనూర్, మే 23 : జైనూర్, సిర్పూర్-యూ మం డలాల్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదివారం పర్యటించారు. ముందుగా సిర్పూర్-యూ మండలంలోని ఖాతీగూడకు వెళ్లి దినకర్ కుటుంబ సభ్యులను, రాగాపూర్కు చెందిన పాత్రికేయుడు జిల్లపల్లి శంకర్ తండ్రి ఇటీవల మృతి చెందగా, శంకర్ను పరామర్శించారు. అనంతరం ఫుల్లారా, సీ తాగోంధి గ్రామాలను సందర్శించి మాజీ సర్పంచ్ అంబుబాయి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొడ సం ధర్మారావ్ను కలిశారు. అనంతరం జైనూర్ మండలంలోని గౌరి గ్రామానికి చేరుకున్నారు. మాజీ వైస్ ఎంపీపీ షేక్ రషీద్ తండ్రి మృతి చెంద గా కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర హజ్కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావ్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నూపటేల్, లింగాపూర్ మండల టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆత్రం అనిల్, సిర్పూర్-యూ వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్, నాయకులు యశ్వంత్రావ్ తదితరులు ఉన్నారు.