పెద్దపల్లి డీసీపీ రవీందర్
లాక్డౌన్ పరిశీలన
పలుచోట్ల వాహనాలు సీజ్
సుల్తానాబాద్ రూరల్, మే 23: కరోనా నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ను ఆదివారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్ రావు, పీఎస్ఐ జ్యోత్స్న, ఏఎస్ఐ నాగయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అనవసరంగా వస్తే వాహనం సీజ్
పెద్దపల్లిటౌన్, మే 23: అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలు సీజ్ చేస్తామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. పెద్దపల్లిలోని కమాన్చౌరస్తా, బస్టాండ్, అయ్యప్పటెంపుల్ రోడ్డులో ఆదివారం ఆయన వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఇక్కడ సీఐ ప్రదీప్కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్, ఎస్ఐ రాజేశ్, పీఎస్ఐ రాజ్వర్ధన్ తదితరులు ఉన్నారు.
ఓదెల, మే 23: అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఓదెల, పొత్కపల్లి, గుంపులలో ఆదివారం సీఐ లాక్డౌన్ను పర్యవేక్షించారు. రోడ్లపైకి వచ్చిన 48 వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు పొత్కపల్లి ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్, మే 23: లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ సుల్తానాబాద్ సీఐ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో వాహనాలు తనిఖీ చేశారు. లాక్డౌన్ అమలు తీరును ఎస్ఐ వెంకటేశ్వర్ను అడిగి తెలుసుకున్నారు.
సుల్తానాబాద్, మే 23 : సుల్తానాబాద్లోని రాజీవ్ రహదారిపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి, 40 వాహనాలు సీజ్ చేశారు. ఇక్కడ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్రావు, పీఎస్ఐ జ్యోత్స్న పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ముత్తారం,మే23: ఎస్ఐ బేతి రాములు ఆధ్వర్యంలో మండల కేంద్రంతో మండలంలోని ఆయా గ్రామాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్తో కరోనా వైరస్ కేసులు మండలంలో చాలావరకు తగ్గాయని ఎస్ఐ తెలిపారు.