కరోనా టైంలోనూ అసహాయులకు రాష్ట్ర సర్కారు కొండంత అండ
నెలనెలా ఠంఛన్గా పింఛన్
సంబురపడుతున్న లబ్ధిదారులు
ఉమ్మడి జిల్లాలో 5,24,197 మందికి ప్రతి నెలా 111.78 కోట్ల లబ్ధి
పెద్దపల్లి, మే 23(నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్తో ప్రతి ప్రభు త్వం కుదేలైంది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. అనేక రంగాల నుంచి రాబడి నిలిచిపోయి రాష్ట్ర ప్రభు త్వ ఖజానాపై ప్రభావం పడుతోంది. అయినా, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. అందులో ఆసరా పథకం ఒకటని చెప్పవచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పథకానికి పునరుజ్జీవం పోసి న ప్రభుత్వం వృద్ధులు మొదలుకుని బోధకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల వరకు ఈ పథ కం కింద ఆదుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఈ పథకానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంలోనే పెద్దపీట వేశారు. లబ్ధిదారులకు ఇస్తున్న మొత్తాన్ని భారీగా పెంచారు. దివ్యాంగులకు 1,500, ఇతర కేటగిరీల్లోని లబ్ధిదారులకు వెయ్యి చొప్పు న అందించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి న తర్వాత దివ్యాంగులకు 3,016, ఇతర కేటగిరీల్లోని లబ్ధిదారులకు 2,016 చొప్పున పెంచి సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ని నిలబెట్టుకున్నారు. ఈ మొత్తాన్ని ప్రతినెలా క్రమం తప్పకుండా లబ్ధిదారులకు అందేలా చూస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
పింఛన్ వస్తేనే పూట గడిచేది..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్తోనే అనేక కుటుంబాల్లో పొయ్యి వెలుగుతోంది. అనేక కుటుంబాల్లోని వృద్ధులు ఈ పథకం కింద వచ్చే పింఛన్ ఆధారంగానే బతుకెళ్లదీస్తున్నా రు. ఇలాంటి కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. భర్తలను కోల్పోయిన వితంతులు తమ పిల్లలను పోషించుకునేందుకు ఈ పథకం ఎంతో ఆసరా అవుతోంది. దివ్యాంగుల గురించి ఇక చెప్పనవసరం లేదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆదరించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీరికి ప్రతి నెలా 3,016 అందిస్తోం ది. ఇలాంటి కష్ట కాలంలో దివ్యాంగులు బతికేందుకు ఆసరా పథకం జీవం పోస్తోంది. ఇక గీత, నేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటిరి మహిళల్లో చాలా మంది ఈ పథకం కింద వచ్చే పింఛన్ ఆధారంగానే జీవనం సాగిస్తున్నారు. బోదకాలు బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. వీరి మందులు, కుటుంబాల కోసం పింఛన్ డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తమకు ప్రతి నెలా డబ్బులు అందిస్తోందని లబ్ధిదారులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 111.78 కోట్ల లబ్ధి
కరీంనగర్ జిల్లాలో ప్రతి నెలా అన్ని కేటగిరిల్లో ని 1,17,634మంది లబ్ధిదారులకు 25.74 కోట్లు, జగిత్యాలలో 2,16,703 మంది లబ్ధిదారులకు 45.47 కోట్లు, పెద్దపల్లిలో 78,780 లబ్ధిదారులకు 17.16 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,11,080మందికి 23.41కోట్లు ప్రతి నెలా ఠంచన్గా అందుతున్నాయి.