పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథనిలో గోదాం, షటర్ల నిర్మాణానికి శంకుస్థాపన
మంథని టౌన్, జూన్ 22: పేద ప్రజల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో రూ.25లక్షలతో చేపట్టిన గోదాం, షటర్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా, మండల ప్రజాపరిషత్ల ద్వారా వచ్చే నిధులతో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్కూళ్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వెటర్నరీ దవాఖానల భవన నిర్మాణాలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఎంపీపీ కొండ శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ తగరం సుమలత, ఏఎంసీ చైర్ పర్సన్ శ్రీరాంభట్ల సంతోషిణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ఎగోలపు శంకర్గౌడ్, మండలాధ్యక్షుడు ఆకుల కిరణ్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మంథని రూరల్/మంథని టౌన్, జూన్ 22: మండలంలోని పుట్టపాకలో పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ తండ్రి కొత్త లింగయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని మధూకర్ పరామర్శించారు. లింగయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే పట్టణానికి చెందిన కొమురోజు సుగుణమ్మ ఇటీవల మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ కొండ శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, టీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్గౌడ్, ఆకుల కిరణ్ తదితరులున్నారు.