’రాజన్న సిరిసిల్ల, జూన్ 21 (నమస్తే తెలంగా ణ): రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. పలు ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంలు దాటుతూ గోదావరి ఎగువమానేరును తొలిసారిగా ముద్దాడింది. మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వర జలాలు మెట్టను అభిషేకించనున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
దశాబ్దాల పాటు కరువు కాటకాలతో తల్లడిల్లిన మెట్టకు జలసిరి సంతరించుకోనున్నది. రెం డు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎగువ మానేరును కాళేశ్వర జలాలతో నింపారు. వానలు పడితే తప్ప నిండని మానేరు మండుటెండల్లో మత్తడి దూకి చరిత్రలో రికార్డు సృష్టించింది. ఈ మా నేరు ప్రాజె క్టు నుంచి జూలై మొదటి వారంలో నీటిని విడుద ల చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాం గం సన్నాహాలు చేస్తున్నది. మానేరు ప్రాజెక్టు ద్వా రా మొత్తం 20వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం కాగా, ఈ వానకాలంలో గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలలోని 13వేల ఎకరాలకు సాగునీరందించేందుకు యంత్రాంగం సన్నద్ధ్దమవుతున్నది. కుడి కాలువ ద్వారా 7కుంటలు, 2 చెరువులు, ఎడమ కాలువ ద్వారా 6కుంటలు, 3 చెరువులు నింపనున్నారు. 13 వేల ఎకరాల్లోని చివరి ఆయకట్టు వరకు నీరందించే ప్రణాళికను నీటి పారుదల శాఖ రూపొందిస్తున్నది.
సాగుకు సన్నద్ధం..
వానకాలం పంటల సాగుకు సన్నద్ధ్దమవుతున్న వేళ మానీరు పరవళ్లు తొక్కడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మానీటితో మెట్టను అ భిషేకిస్తానంటూ ఇచ్చిన మాటను అమాత్యుడు కేటీఆర్ నిలబెట్టుకున్నారు. దశాబ్దాల కల సాకా రం చేసిన మంత్రిని రైతాంగం వేనోళ్ల కొనియాడుతున్నది. జిల్లాలోని 13 మండలాల్లో 666 చెరువులుండగా, వీటి కింద 44,060 ఎకరాల ఆయకుట్టు ఉంది. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కింద చెరువులన్నింటిని పూడిక తీసి పున రుద్ధరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9,10,11,12 ద్వారా జిల్లాలోని చెరువులన్ని నింపాలన్నది ల క్ష్యం. సిరిసిల్ల పట్టణంలోని మధ్యమానేరు బ్యాక్ వాటర్ను సొరంగ మార్గం ద్వారా కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్కు చేరుస్తారు. 3టీఎంసీల సామర్ధ్యం ఉన్న మల్కపేట చె రువు నిర్మాణ పనులు చకా చకా సాగుతున్నాయి.
రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో మం త్రి కేటీఆర్ ఆదేశాల మేరకు యంత్రాంగం సిద్దిపేట జిల్లా తొగుట వద్ద ఉన్న పంప్హౌస్ ద్వారా వచ్చిన (మల్లన్నసాగర్) జలాలతో ఎగువ మానేరును నింపాలని నిర్ణయించింది. మల్లన్న సాగర్ కెనాల్ సుమారు 35 కిలోమీటర్ల దూరం నుంచి దుబ్బాక మండలం రాజక్కపేట మీదుగా ముస్తాబాద్ మండలం మద్దికుంట ఊరచెరువుతో పాటు 12 చెరువులను నింపారు. మద్దికుంట ఊర చెరు వు 62 ఎకరాలు, 10 మిలియన్ క్యూబిక్ ఫీట్ల సా మర్థ్యం ఉండగా, అక్కడి నుంచి లింగంపేట చె రువు సామర్థ్యం 42 ఎకరాలు, 7 ఎంసీలు, ము స్తాబాద్ పెద్ద చెరువు 443 ఎకరాలు 73 ఎంసీలు, చీకోడు చింతల చెరువు 150 ఎకరాలు 26 ఎంసీ లు, గూడెం కొండ చెరువు 415 ఎకరాలు 69 ఎంసీలు, బొప్పెన కుంట చెరువు 84 ఎకరాలు 14 ఎంసీలు, ఎర్రచెరువు 108 ఎకరాలు 18 ఎం సీలు, ఆవునూరు పెద్దచెరువు 310 ఎకరాలు 51 ఎంసీలు, నామాపూర్ కొత్తచెరువు 43 ఎకరాలు 7ఎంసీలు, మేళ్ల చెరువు 153 ఎకరాలు 25 ఎంసీ లు మల్లారెడ్డి చెరువు 57 ఎకరాలు 9 ఎంసీలు, కోనేటి చెరువు 43 ఎకరాలు 7 ఎంసీల సామర్థ్యంగల వీటిలో మానేరు నీటిని నింపనున్నారు. కాగా కుడి, ఎడమ కాలువ ద్వారా 13 కుంటలు, 5 చె రువులను వచ్చేనెల మొదటి వారంలో నింపి 13 వేల ఎకరాలకు సాగునీరందించనున్నారు.