పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
పెద్దపల్లి కమాన్, జూన్ 21: ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా సోమవారం పెద్దపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.
జీవితం త్యాగం చేసిన మహనీయుడు
గోదావరిఖని, జూన్ 21: తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, అడ్డాల స్వరూప, కృష్ణవేణి, కవిత సరోజని, నాయకులు బొడ్డు రవీందర్, గంగ శ్రీనివాస్, అచ్చ వేణు, తోకల రమేశ్, తిరుపతి, నాయకులు మేకల పోశం, విజయ్కుమార్ ఉన్నారు.
పెద్దపల్లి రూరల్, జూన్ 21: పెద్దపల్లి మండలపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జయశంకర్ వర్ధంతిని నిర్వహించగా, ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్గౌడ్, అధికారులు ప్రొఫెసర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజు, ఎంపీవో సుదర్శన్, ఏపీవో మల్లేశ్వరి, పంచాయతీ రాజ్ ఏఈ పటేల్ మదన్మోహన్ రెడ్డి, పర్యవేక్షకుడు సేనారెడ్డి, హరికృష్ణ, అక్రమ్, టీఏలు దివ్య, వెంకటేశ్, హసన్ పాల్గొన్నారు.
మంథని టౌన్, జూన్ 21: మంథనిలో టీఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్, కౌన్సిలర్ వీకే. రవి, టీఆర్ఎస్ నాయకులు ఏగోలపు శంకర్గౌడ్, గుండా పాపారావు, అక్కపాక సంపత్, ఆకుల కిరణ్, బత్తుల సత్యనారాయణ, మంథని లక్ష్మణ్ ఉన్నారు.
రామగిరి, జూన్ 21 : ముస్త్యాలలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రామగిరి నాగరాజు, కార్యదర్శి పరశురాం తదితరులు పాల్గొన్నారు.
కోల్సిటీ, జూన్ 21: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేశ్, వేముల అశోక్, పోగుల శేఖర్, వెంకటేశ్ ఉన్నారు.
యైటింక్లయిన్కాలనీ, జూన్ 21: టీబీజీకేఎస్ కార్యాలయంలో సార్ చిత్ర పటానికి డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకలు కొత్త సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బేతి చంద్రయ్య, ఆకుల రాజిరెడ్డి, సమ్మయ్య, సత్యనారాయణ, ప్యారేమియా తదితరులు పాల్గొన్నారు.
జూలపల్లి, జూన్ 21: కాచాపూర్లో ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి సార్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళుల ర్పించారు. ఇక్కడ సర్పంచులు, మేచినేని సంతోష్ రావు, బంటు ఎల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు తమ్మడవేని మల్లేశం, మారుపాక శ్రీలత, ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఎంపీవో రమేశ్, ఏపీవో సదానందం, ఏపీఎం తులసీమాత, నాయ కులు గండు మల్లారెడ్డి, కొత్త మల్లేశం, కుమార్ తదితరులు ఉన్నారు.