నార్నూర్, జూన్ 21: జిల్లాలో అధికారులు, ప్రజాప్రతిని ధులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయాశాఖల అధికారులు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పలు సమస్య లను జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనుమతి లేని, నాణ్య తలేని ఎరువులు, విత్తనాలు అమ్మేవారిపై కఠినంగా వ్యవహ రించాలని వ్యవసాయాధికారి గిత్తే రమేశ్కు సూచించారు. రై తుల ఖాతాలను హోల్డ్లో పెట్టిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, సంబంధితశాఖ అధికారులతో మాట్లాడి పెట్టుబడి సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 12మందికి ప్రభు త్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు లు పంపిణీ చేశారు. కరోనా ఆపత్కాలంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నదని తెలిపారు. తాడిహత్నూర్ గ్రామానికి చెందిన శ్రీ కాంత్ క్యా న్సర్తో బాధపడుతుండగా, జడ్పీ చైర్మన్ రూ. 5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్, తహసీల్దా ర్ దుర్వా లక్ష్మణ్, ఎంపీడీవో కే.రమేశ్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, ఎంపీవో స్వప్నశీల, ఎంఈవో రాపెల్లి ఆశన్న, వైద్యుడు విజయ్కుమార్, పశు వైద్యాధికారి రాథోడ్ రమేశ్, ఏపీఎం రమేశ్, ఏపీవో జాదవ్ శేషారావ్, ఏఈలు జాడి లింగన్న, శ్రీనివాస్, సుభానీ, వ్యవసాయ అధికారి గిత్తే రమేశ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆ యా శాఖల అధికారులు ఉన్నారు.
హరితహారంతోనే పర్యావరణ పరిరక్షణ
-నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి
నిర్మల్ టౌన్, జూన్ 21: హరితహారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం మొక్కలు నాటి మొక్కల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి రైతూ తమ పంట పొలంలో మొక్కలు నాటి అవి పెంచే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. అడవులు పెరగడం వల్లే, వర్షాలు కు రిసి పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలతో ఉం టారని పేర్కొన్నారు. ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రె డ్డి, నాయకులు పాల్గొన్నారు.