మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ
విద్యార్థులకు బహుమతులు ప్రదానం
సిరిసిల్ల టౌన్, జూన్ 20: నిత్య యోగా సాధన తో మానసిక ప్రశాంతతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. ఆదియోగి-యోగా సాదనాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తీవ్రమైన పని భారం, తదితర కారణాలతో చాలా మం ది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీని ప్రభా వం ఆరోగ్యంపై చూపుతుందన్నారు. శారీరక సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు యోగా ఔషధంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం కేటాయించి యోగా చేయాలని కోరారు. అనంతరం యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులతోపాటు యోగా శిక్షకుడు ఉప్పల శ్రీనివాస్కు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎంఈవో రఘుపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ పాల్గొన్నారు.