ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
వాయిద్య పరికరాల పంపిణీ
నిర్మల్ అర్బన్, జూన్ 20: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కళాకారులు చేసిన పోరాటం మరువలేనిదని, అందరి పోరాట ఫలితంగానే స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పెన్షనర్ భవనంలో శంకర్ ప్లాంజేరి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన జానపద కళాకారులకు వాయి ద్య పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. కళాకారులకు వాయిద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. జానపద కళాకారులు కరోనా ప్రభావంతో ప్రోగ్రాంలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద కళాకారులకు చేయూతనిచ్చి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్లాంజేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాకారులకు వాయిద్య పరికరాలు, వేషభూషణాలను పంపిణీ చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. కరోనాతో ఉపాధికి దూరమైన కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన కళాకారులందరికీ ప్రభుత్వం సాంస్కృతిక శాఖలో ఉద్యోగాలను కల్పించిందని గుర్తు చేశారు.
కరోనా మహమ్మా రి అందరినీ ఇబ్బందులకు గురి చేసిందని, ప్రభుత్వం కరోనా కట్టడికి ఎంతో కృషి చేయడంతో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. దీంతో లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసిందని, అయినా ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజయ్య, గౌరవాధ్యక్షుడు డాక్టర్ కృష్ణంరాజు, జిల్లా అధ్యక్షురాలు ఎట్టెం రజిత, ఉపాధ్య క్షుడు జున్ను అనిల్, జిల్లా కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయివాడ బంగల్పేట్ కాలనీలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ దేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆదివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతుందన్నారు. నిర్మల్ జిల్లాలో దాదాపు రూ.50 కోట్లతో 600కు పైగా ఆలయాలను నిర్మించుకున్నామని పేర్కొన్నారు. నూతన ఆ లయాలతో పాటు నిరాదరణకు గురైన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చి ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, ఎడిపెల్లి నరేంధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకుడు అడ్పపోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.