మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు
కమిటీ సభ్యులకు సన్మానం
మంచిర్యాల ఏసీసీ, జూన్ 20 : విశ్వనాథ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సూచించారు. మంచిర్యాల విశ్వనాథ ఆలయ రెనోవేషన్ కమిటీ అధ్యక్షుడిగా సిపురం శ్రీనివాస్తో పాటు సభ్యులుగా హరీశ్, కాడె ఎల్లయ్య, రామ్ కిశోర్ దాలియా, గంగాధర్, చరణ్దాస్, బొడ్డు తిరుపతి, మంతెన గట్టయ్య, గొట్టిముక్కుల శంకరయ్య, ఇందూరి మల్లయ్య, మాదాడి లక్ష్మి, రీనారాణీదాస్, సంధ్యారాణి, మై లారం అర్చనను ఆలయ కార్యనిర్వహణ అధికారి ముక్త రవి ఆధ్వర్యంలో అర్చకులు సంగనభట్ల నరహరి శర్మ, భట్టచార్యులు, బాలకృష్ణ శర్మ వేదమంత్రాలతో ఆదివారం ఆశీర్వదించారు. ఈ సం దర్భంగా ఆలయంలోని ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సభ్యులను శాలువాలతో సత్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్, కౌన్సిలర్లు మాదంశెట్టి సత్యనారాయణ, చంద్రశేఖర్ హండే, నాయకులు విజిత్ రావు, పట్టణ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు గాదె సత్యం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, వా సవీ క్లబ్ అధ్యక్షుడు కాచం సతీశ్, ఆవోపా అధ్యక్షుడు తంగెడిపల్లి సత్యవర్దన్ పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
దండేపల్లి, జూన్ 20 : రైతుల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండలంలోని తాళ్లపేట, మేదరిపేటలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాల్లో రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తారన్నారు. కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, స్థానిక సర్పంచ్లు కళావతి, లచ్చు పటేల్, ఉప స ర్పంచ్లు పుట్టపాక తిరుపతి, బట్టు రాజయ్య, ర మేశ్, కాండ్రాపు లక్ష్మణ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బండారి మల్లేశ్, ఆకుల రాజేందర్, గడ్డం రాంచందర్, మాడ దయాకర్, నజీర్, మంత్రి దేవయ్య, పత్తిపాక సంతోష్, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు.