ఖమ్మం, జూన్ 20: సుడా చైర్మన్గా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా బచ్చు విజయ్కుమార్ను టీఆర్ఎస్కేవీ ఖమ్మం మున్సిపల్ విభాగం కార్మిక సంఘం నాయకులు ఆదివారం సన్మానించారు. నగరంలోని సుడా కార్యాలయంలో ఆయనను కలిసిన నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి అభింనదనలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ముత్యాల ఫణిందర్, రాష్ట్ర కార్యదర్శి చిలుకూరు సూర్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి గుమ్మడి రమేశ్, కోశాధికారి మాడుగుల శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు జ్యోతి, ఉపాధ్యక్షులు పల్లెపొంగు రాజు, దాదే సతీశ్కుమార్, కార్పొరేటర్ దాదె అమృతమ్మ, నాయకులు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.