నియోజకవర్గానికి 10 వేల క్వింటాళ్ల జీలుగులు
ముందస్తుగానే రైతులకు ఎరువుల అందజేత
వేంసూరు, మే 20: రైతుల కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని, ధాన్యం కొనుగోళ్లపై సంక్షేమం అధైర్యపడవద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులకు భరోసా కల్పించారు. మర్లపాడు డీసీసీబీ బ్యాంకులో లచ్చన్నగూడెం సొసైటీ పరిధిలో సొసైటీ ఛైర్మన్ గండ్ర సోమిరెడ్డి అధ్యక్షతన జీలుగులు, పిల్లి పెసర విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ సమయంలోనూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సీఎం కేసీఆర్ ప్రణాళికబద్ధ్దంగా ముందుకెళుతున్నారన్నారు. ఇప్పటివరకు 25లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు చేశామని, అంతేకాకుండా రూ.30వేల కోట్లను తెలంగాణ రైతుల కోసం సివిల్సైప్లె కార్పొరేషన్కు అప్పుగా ఇచ్చి రైతులను ఆదుకుంటామని అన్నారు. రైతులకు చెందిన కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయించి రైతుఖాతాల్లో నగదు జమయ్యేలా చూస్తామన్నారు. ప్రజలు మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారోజు సుమలత, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, ఆత్మ డైరెక్టర్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వేంసూరు సొసైటీ ఛైర్మన్ తక్కెళ్లపాటి గోపాలకృష్ణ, మర్లపాడు సర్పంచ్ మందపాటి వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ మందపాటి రాఘవరెడ్డి, ఏఓ రామ్మోహన్, ఎంపీడీవో వీరేశం, సీఈఓ గోపి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలా వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు గుత్తా శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే
వేంసూరు, మే 20 : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలైన వెంకటాపురం చెక్పోస్టును ఆయన ఏసీపీ వెంకటేశ్తో కలిసి పరిశీలించారు. అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్సిబ్బందికి వాటర్బాటిళ్లు, మాస్క్లు, శానిటైజర్లు, పండ్లు అందజేసి మాట్లాడారు. ప్రజలు కష్టంతో కాకుండా ఇష్టంతో లాక్డౌన్ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కరుణాకర్, ఎస్సై సాయికుమార్, ట్రైనీ ఎస్ఐ డీ.సోనియా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలా వెంకటరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.