మంచిర్యాలలో ఏబీఏపీ ఆధ్వర్యంలో పంపిణీ
ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి
వాడకంపై అవగాహన కల్పించిన ఆనందయ్య సోదరుడి కుమారుడు ప్రణవ్
మంచిర్యాల ఏసీసీ, జూలై 19 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేయగా. విశేష స్పందన వచ్చింది. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందర్ రెడ్డి ఏబీఏపీ సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షుడు రాచర్ల రమేశ్ మాట్లాడుతూ.. ఈ మందును జిల్లాలో సుమారు 30 వేల మందికి ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం ఆనందయ్య సోదరుడి కుమారుడు ప్రణవ్ మందు వాడే విధానాన్ని వివరించారు. కరోనా రాకుండా ఉండేందుకు, వచ్చి, తగ్గి రెండు నెలలు దాటిన వారు మందు వాడవచ్చని సూచించారు. బఠాణీ గింజ సైజులో ఈ మందును ఒక్క రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు. మందు తీసుకునే అరగంట ముందు, తర్వాత ఎలాంటి ఆహారం, పానియాలూ తీసుకోవద్దని సూచించారు.
ఐదేళ్లు పైబడిన వారందరూ వేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే పిల్లలకు మందు మోతాదు తగ్గంచి వాడాలని, గర్భిణులు, ఋతుక్రమం వచ్చిన వారు ఈ మందు వాడవద్దని సూచించారు. అలాగే మందు తీసుకునే ముందు రోజు, తీసుకున్న రోజు మద్యపానం, మాంసాహారం తీసుకోవద్దని తెలిపారు. ఎక్కువగా నీరు తాగాలని, మందును ఫ్రిజ్లో పెట్టవద్దని, 15 రోజులలోపే తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ మందు కోసం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఇబ్బందులు కలుగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతీ య కార్యవర్గ సభ్యుడు రాజేందర్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తేలు శ్రీనివాస్, రాష్ట్ర జోనల్ కార్యదర్శి అంబిలపు శ్రీనివాస్, భాస్కరా చారి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ (పీఆర్వో) మ ట్టపల్లి సంపత్ రావు, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రా జయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు తోట ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రఘుపతి రావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం, కోశాధికారి శివారెడ్డి, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, ఏబీఏపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.