జిల్లా ఇన్చార్జి ఎస్పీ , రామగుండం సీపీ సత్యనారాయణ
850 కిలోల విత్తనాలు పట్టివేత, ఇద్దరి అరెస్టు
కాగజ్నగర్ రూరల్, జూన్ 18 : నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఇన్చార్జి ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్లో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దహెగాం మండలంలోని పీపీరావు కాలనీ సమీపంలో శుక్రవారం దహెగాం పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. ఓ కారును సో దా చేయగా నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు ల భించాయన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, పిట్టల శ్రీనివాస్, బండి శ్రీధర్ పెద్దపెల్లి జిల్లా ఓదెల గ్రామాలకు చెందిన వారిగా గుర్తించి వారి ఇండ్లలో సోదాలు నిర్వహించామన్నారు. శ్రీధర్ ఇంట్లో 750 కిలోల నకిలీ విత్తనాలను, అలాగే మంచిర్యాల జిల్లా భీమిని, కన్నెపల్లి మండలాల్లో కొన్ని ప్యాకెట్లు అమ్మినట్లు తెలుపగా రైతుల నుంచి 100 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ సుమారు రూ. 17 లక్ష లు ఉంటుందని చెప్పారు. ఇద్దరిపై కేసు నమో దు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీ సు సిబ్బందిని ఆయన అభినందించారు. స మావేశంలో జిల్లా అదనపు ఎస్సీ వైవీఎస్ సు ధీంద్ర, బాలస్వామి, రూరల్ సీఐ రాజేంద్ర ప్రసాద్, రఘుపతి, ఎస్ఐ సందీప్, పోలీసు సిబ్బంది ఉన్నారు.