మక్తల్రూరల్, సెప్టెంబర్ 17: కరోనా వైరస్ నివారణ కోసం గ్రామాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కరోనా టీకాలు వేసుకోవడానికి పల్లెల నుంచి పట్టణాలకు రావడానికి ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం గ్రామాల్లోనే కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మక్తల్ మండలంలో వారం రోజుల నుంచి వ్యాక్సినేషన్ టీకాల స్పెషల్ డ్రైవ్ను ముమ్మరంగా చేపట్టారు. కార్యక్రమాన్ని కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతోఅధికారులు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. ఇంతవరకు మండలంలో దాదాపు 55 శాతం మందికి కరోనా టీకాలు వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. శుక్రవారం కర్ని, మక్తల్ పీహెచ్సీ సెంటర్ల పరిధిలో పంచదేవ్పాహడ్, పస్పుల, చిట్యాల, ముస్లాయపల్లి, పారేవుల, దాదాన్పల్లి తదితర గ్రామాలలో యువకులు స్వ చ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వ్యా క్సిన్ టీకాలు వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎవరైనా టీకాలు వేసుకోనివారు ఉంటే తప్పకుండా వేసుకోవాలని ఎంపీడీవో శ్రీధర్ కోరారు.
నర్వ మండలంలో..
నర్వ, సెప్టెంబర్ 17: కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం మండలంలోని కొత్తపల్లి, లంకాల, రాంపూర్ తదితర గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్ ప్రభాకర్జెట్టి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలందరూ కొవిడ్ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వైద్య, ఐసీడీఎస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మాగనూర్లో
మాగనూర్, సెప్టెంబర్ 17:కరోనా వైరస్ను జయించడానికి మంగళవారం మాగనూర్, వడ్వాట్ నేరెడుగం కొల్పూ ర్ గ్రామాల్లో కొవిడ్ మెగా శిబిరాన్ని ఏర్పాటు చేసి 18 ఏండ్ల్లు నిండిన వారికి కొవిడ్ టీకా ఇచ్చినట్లు మండల వైద్యాధికారి తెలిపారు. వ్యాక్సినేషన్కు ప్రజలు సహకరిస్తున్నారన్నారు. సర్పంచులు ప్ర త్యేక శ్రద్ధ్ద వహించి ప్రతి ఒక్కరికీ టీకా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారని, వారికి ధన్యవాదాలు తెలిపారు శుక్రవారం 530మందికి టీకా వేసినట్లు తెలిపారు