కలెక్టర్ షేక్యాస్మిన్బాషా
జిల్లా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం
వనపర్తి, సెప్టెంబర్ 17: లబ్ధిదారులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందజేయాలని కలెక్టర్ షేక్యాస్మిన్బాషా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశం హాల్లో శుక్రవారం బ్యాంకర్లతో డీసీసీడీఎల్ ఆర్సీపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బ్యాంకర్లు పంట రుణాలను సకాలంలో అందజేయాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తోడ్పాటుకు ముందుకు రావాలన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 43దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 26దరఖాస్తులు బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్కు వివరించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తల రుణాలను జాప్యం చేయొద్దని వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి రూ.కోటి వరకు రుణాలు అందజేస్తామని ఎల్డీఎం తెలిపారు. బ్యాంకులో ఏ స్కీంకు రుణాలు ఇస్తారని, స్కీంల వివరాలు తెలిపే బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా రుణాలు 7.7శాతం మాత్రమే ఇచ్చారని, ఇంకా రుణ మొత్తం పెంచేలా హెడ్ ఆఫీస్ వారితో మాట్లాడాలని బ్యాంకు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రూ 9.కోట్ల రుణం ఇచ్చినందున బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. పెద్దకారు రైతులు, ఆయిల్పాం సాగు చేయడానికి రుణాలను తక్షణం అందజేయాలన్నారు. స్వయంఉపాధికి దరఖాస్తు చేసుకునే పాడిపశువులకు రుణాలను మంజూరుచేయాలన్నారు. సెరికల్చర్ అభివృద్ధి చేయాలని, ఆర్బీఐ కార్పొరేషన్ ద్వారా బ్యాంకర్లకు పంపిన 51దరఖాస్తులో సబ్సిడీ నిధులు పెండింగ్లో ఉన్నందున రుణాలు మంజూరు కాలేదని ఎస్టీ శాఖ అధికారి కలెక్టర్కు తెలిపారు. ఎస్బీఐ గ్రామీణాభివృద్ధి అధికారి మాట్లాడుతూ 18-36ఏండ్ల వయస్సు గల వారికి మొబైల్ రిపేర్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హౌస్వైరింగ్ తదితర వాటిపై శిక్షణ ఇస్తామని తెలిపారు. సమావేశంలో నాబార్డు అధికారి శ్రీనివాస్, ఆర్బీఐఎల్డీవో వైభవ్, ఏజీ రాంప్రసాద్, ఏపీజీవీబీ శామ్యూల్, డీఆర్డీవో నర్సింహులు, ఎంప్లాయీమెంట్ అధికారి అనిల్, మల్లికార్జున్, సునీత, యాదమ్మ, ఏవో సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగావకాశాలకు ఉచిత శిక్షణ
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పనకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ షేక్యాస్మిన్బాషా సూచించారు. జిల్లాలోని వైటీసీ బిల్డింగ్ డీఆర్డీవో, ఈజీఎంఎం ద్వారా ఈడబ్ల్యూఆర్సీ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. 90రోజుల శిక్షణ ఉంటుందని కలెక్టర్ సూచించారు. శిక్షణ అనంతరం వారికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింహులు, ఉపాధి కల్పన అధికారి అనిల్కుమార్, హార్టికల్చర్ అధికారి సురేశ్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో వసతులు కల్పించాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షేక్యాస్మిన్బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశం హాల్లో శుక్రవారం పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ, వంటగది నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో మిషన్భగీరథ తాగునీరు కుళాయిలు అమర్చడం జరిగిందన్నారు. సమావేశంలో డీఈవో రవీందర్, ఈఈ మల్లయ్య, డీఈ మేఘారెడ్డి, ఎంఈవోలు పాల్గొన్నారు.