పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తు
30 ఏళ్లలో చేయని అభివృద్ధి ఏడేళ్లలో..ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు
సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో ఉపయోగించాలి
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
పండుగ వాతావరణంలో కమిటీల ఎన్నిక ఎమ్మెల్యే సంజయ్కుమార్
మెట్పల్లి రూరల్, సెప్టెంబర్ 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణలను తొప్పికొట్టాలని ఎమ్మెల్సీ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు భానుప్రసాద్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని వెల్లుల్ల శివారులోని వీఆర్ఎం గార్డెన్స్లో టీఆర్ఎస్ మెట్పల్లి పట్టణ, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. జగిత్యాలలో నియోజకవర్గ వార్డు, గ్రామ కమిటీల పరిశీలన, పట్టణ, మండల కమిటీల ఎన్నికలపై దిశానిర్దేశన కార్యక్రమం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో మంచి పదువులు లభిస్తాయన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ను విద్యార్థి ఉద్యమ నాయకుడు, గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు కేటాయించి, పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్టానం మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్దపు ప్రచారాలను ఖండించాలని, అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కాగా టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులైన ఎమ్మెల్యే విద్యాసాగర్రావును ఎమ్మెల్సీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, వైస్చైర్మన్ చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.
30 ఏళ్లలో చేయని అభివృద్ధి ఏడేళ్లలో..
జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 16 : గత ప్రభుత్వాలు 30 ఏళ్లలో చేయని అభివృద్ధిని స్వరాష్ట్రంలో ఏడేళ్లలో చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు అరవింద్, సంజయ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారికి దమ్మూ, ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ర్టానికి ఐటీటీఆర్, కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన వాటాలను తీసుకురావాలన్నారు. బాండ్ పేపర్ ద్వారా మోసపూరిత మాటాల ద్వారా ప్రజలు ఒకసారి మోసపోవచ్చని, రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి అవకాశం ఇస్తారన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ…జగిత్యాల నియోజకవర్గంలో గ్రామ, వార్డు కమిటీలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నామని పూర్తిస్థాయిలో కమిటీలు పూర్తయ్యాయని పట్టణ, మండల కమిటీలను త్వరలోనే పూర్తిచేసుకుంటామని, దీనికి సహకరించిన నాయకులకు, పార్టీ కార్యకర్తలకు ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీశ్, పార్టీ మండలాధ్యక్షుడు రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.